గుడిసె గుడిసె లో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తాం
కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొని వస్తాము
ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా కర్రీ నాగేంద్రబాబు
మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా మంగపేట మండలంలోని రాజుపేట గ్రామానికి చెందిన కర్రీ నాగేంద్రబాబు ఎన్నికయ్యారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ములుగు జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బానోత్ రవిచందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరై నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కర్రీ నాగేంద్రబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని,రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యువతను చైతన్యం చేస్తూ గ్రామ గ్రామాన,నియోజకవర్గంలోని మండలాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని, ప్రభుత్వ నిరంకుశ,ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై పోరాడుతానని అన్నారు.ఈ ఎన్నిక పట్ల సహకరించిన జిల్లా అధ్యక్షులకు, మండల అధ్యక్షుడు, మండల,వివిధ అనుబంధ సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను...
Post A Comment: