మన్యం మనుగడ,పినపాక:
విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత ఆశయాలు సాధించడానికి పునాది అయిన పాఠశాలకు తనవంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట పంచాయితీ భూపతి రావు పేట గ్రామానికి చెందిన,వింజమూరి త్రిమూర్తులు, స్వాతి దంపతులు, 2000-2001 కు చెందిన,పూర్వ విద్యార్థులు జానంపేట జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్న స్నేహితులతో కలసి,పాఠశాల కు సరస్వతి విగ్రహంను ఏర్పాటు చేసి బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు, మాట్లాడుతూ తమ వంతు సహయంగా చదువుకున్న పాఠశాలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని స్నేహితుల సహయంతో చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమం లో జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్, ప్రధానోపాధ్యాయురాలు రమణ,పాఠశాల కమిటి చైర్మెన్ మహాలక్ష్మి, ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ, ఆత్మ కమిటి చైర్మన్ భద్రయ్య,సోసైటి చైర్మన్ రవి వర్మ, వి.అర్.ఓ వెంకటమ్మ, గ్రామ పెద్దలు,సుబ్రహ్మణ్యం,ప్రసాద్,శివాజీ రాజు,ఉపాధ్యాయులు పోలెబోయిన అనిల్,బావ్ సింగ్,వేల్పుల రవి కూమర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: