మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండల పరిధిలోని సారపక పట్టణానికి చెందిన తెరాస సీనియర్ నాయకులు గొనె ధారుగా సతీమణి సత్యవతి ఇటీవల స్వర్గస్థులవగా నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించిన ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి..
ఈ కార్యక్రమంలో వారి వెంట పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,తెరాస రాష్ట్ర నాయకులు తెల్లం వెంకట్రావు,ఖమ్మం మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్ బాబు, బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటి చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, మండల తెరాస అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,మండల తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, టిఆర్ఎస్కెవి యూనియన్ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, యూనియన్ నాయకులు, మండల తెరాస మండల నాయకులు, స్థానిక తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: