CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్యమంత్రి మైనార్టీ బంధువు కాలేరా? అబ్దుల్ నబి

Share it:

 


మన్యం టీవీ : ఇల్లందు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆవాజ్ ఇల్లందు పట్టణ కమిటీ సమావేశం లో ఆ వాజ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ గారు దళిత బందు పథకం అమలు ప్రకటించడం శుభపరిణామం అని అన్నారు.అయ్యా ముఖ్య మంత్రి గారు మీకు మైనార్టీ ల గురించి అందరికంటే మీకే ఎక్కువ తెలుసని వారి అభివృద్ధికి కృషి చేస్తానని ,సుధీర్ కమీషన్ వేశారు కమీషన్ సర్వే చేసి ముస్లిం లలో 98శాతం మంది అస్థిర ఆదాయాలతో జీవిస్తున్నారని తేల్చింది.పంచర్ షాపులలో, మెకానిక్, వీధి వ్యాపారాలు,హోటల్లో పనిచేస్తూ అరకొరగా అర్ధాకలితో జీవిస్తున్నారు.నూటికి సగం మంది అద్దె ఇళ్ళలో ఉంటున్నారు.ముస్లిం లకు 12 శాతం రిజర్వషన్లను ప్రకటించి అసెంబ్లీ లో తీర్మానం చేసి చేతులు కున్నారు, మైనార్టీ సబ్ ప్లాన్ అతటుకెక్కింది ,2016 నుండి నేటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా లో 12 వేలమంది లోన్ల కోసం దరఖాస్తులు పెడితే 227 మందికి మాత్రమే ఇచ్చారు.పిల్లలకు పప్పు బెల్లాలు ఇచ్చినట్లుగా రంజాన్ తౌఫాలు ఇఫ్తార్ విందులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.ఇప్పటికైనా మైనార్టీ లకు బంధువు అయ్యి దళిత బందు లాగా మైనార్టీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టి మైనార్టీ ల జీవితాలలో వెలుగు నింపాలని కోరారు.దీనికోసం మైనార్టీ లందరిని ఐక్యం చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో ఆవాజ్ పట్టణ అధ్యక్షుడు,కార్యదర్శులు షేక్ జాఫర్, షేక్ ఖాదర్,రహ్మాన్, అదిల్,కరీం,సలీం, సుభాని, అఫ్సర్, మహమూద్, జమీల్ పాషా, గౌస్, వకేల్, యాకూబ్,ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: