మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం యందు గోవిందరావుపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చింత క్రాంతి ఆధ్వర్యంలో ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క మరియు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవిచందర్ సమక్షంలో గోవిందరావుపేట నుండి భారీగా యువకులు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని పార్టీ సభ్యత్వాన్ని పుచ్చుకున్నారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ రాబోవు భవిష్యత్ యువతదేనని, పోరాటాలు అయిన, ఉద్యమాలు అయిన యువతతోనే సాధ్యం అని అన్నారు.నీతి,నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి,ప్రజా గొంతుకగా,ప్రజా సమస్యలపై కొట్లాడాలని యువతకు సందేశాన్ని ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి కార్యాచరణ చేసుకుంటూ, పార్టీ పిలుపుకు స్పందిస్తూ కష్టపడినవారికి కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ ఉంటుందని అన్నారు.ఇవాళ్టి యూత్ లీడర్లే రేపు కాంగ్రెస్ పార్టీని నడిపించే రథ సారథులు అవుతారని అన్నారు.రేవంత్ రెడ్డి కి టీపీసీసీ చీఫ్ ఇచ్చిన దగ్గరి నుండి యువతలో ఉత్సాహం వచ్చిందని,కాంగ్రెస్ పార్టీ యువకులు భారీగా చేరుతున్నారని సీతక్క అన్నారు. అలాగే గోవిందరావుపేట మండల తెరాస పార్టీ సహకార సంఘ డైరెక్టర్ కొట్టేం కృష్ణ,సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లాఅధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి,జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్,మండల యూత్ నాయకులు బలుగురి శ్రీను, రేగుల అరవింద్, గోవిందరావుపేట గ్రామ యూత్ అధ్యక్షుడు మద్దినేని వినయ్, రంగాపూర్ గ్రామ యూత్ అధ్యక్షుడు వంక సాంబయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: