మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు కోవిడ్ సెంటర్లో పనిచేసిన వర్కర్లకు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 8వ రోజుకు చేరుకున్నాయి.ఈ దీక్షలను తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ కె నబీ, టీజేఎస్ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు కుడికాళ్ల ఆంజనేయులు సందర్శించి తమ సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మణుగూరు కోవిడ్ సెంటర్లో వర్కర్లతో పని చేయించుకొని సకాలంలో జీతాలు ఇవ్వకుండా అధికారులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.వర్కర్ల వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేయడంలో అధికారుల ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు మానవతా దృక్పథం ప్రదర్శించి వెంటనే వారికి జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. మధుసూదన్ రెడ్డి, మణుగూరు ఏరియా నాయకులు ఎండి.గౌస్, యాకన్న,శ్రీకాంత్, ఏఐకెయంఎస్ నాయకులు వెంకటేశ్వర్లు,టీజేఎస్ నాయకులు కరుణాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,వర్కర్లు జి. రాణి,ఈ.మంగమ్మ జానకి, మహాలక్ష్మి,రాంబాయమ్మ, ఐ రాముడు,శైలజ,పి రాములు, జయమ్మ, తిరుమల్రావు,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: