గుండాల ఆగస్టు 26 (మన్యం మనుగడ) వచ్చేనెల ఒకటో తారీకు నుండి పాఠశాలలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలో జరుగుతున్న పారిశుద్ధ పనులను మర్కోడు సర్పంచ్ కొమరం శంకర్ బాబు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతు. గత రెండు సంవత్సరాల నుండి పాఠశాలలు మూసి ఉండటం వలన పాఠశాల ప్రాంగణం మరియు గదులలో చెత్త దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్నాయని పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పాఠశాల పరిసరాలను శుభ్రం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు
Post A Comment: