గుండాల ఆగస్టు 2 (మన్యం మనుగడ) కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఉద్యమిస్తే నే ఆదివాసీలకు మనుగడని న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఎద్దులపల్లి సత్యం అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కొమరం భీమ్ విగ్రహం వద్ద పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసి దినోత్సవ సందర్భంగా డివిజన్ పరిధిలోని ఏడో తారీఖు భద్రాచలం, 8న ఇల్లందు, 9న కొత్తగూడెం తో పాటు ములుగు, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ కూడా ఆదివాసీల పట్ల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు అన్నారు. న్యూ డెమోక్రసీ పార్టీ లో ఎందరో నాయకులు ప్రజల కోసం తమ విలువైన ప్రాణాలను అర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జే సీతారామయ్య, ఎండి రాసుదీన్, బి రామ్ సింగ్, మాజీ ఎంపీపీ ఈసం కృష్ణ , రామయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: