👉ఆదివాసి మనుగడ కోసం పోరాటం చేయాలి...
👉ఆదివాసి ఐక్యత కావాలి ఆదివాసి హక్కుల కాపాడాలి...
మన్యం మనుగడ దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం లో నే ప్రపంచ ఆదివాసి దినోత్సవం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది సభ అధ్యక్షుడు మరయిగూడెం సర్పంచ్ తిరుపతి అధ్యక్షతన సభ లో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కారం పుల్లయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ తూ గ్రామ గ్రామాన ప్రపంచ ఆదివాసి దినోత్సవం కార్యక్రమం ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల తో ఘనంగా నిర్వహించడం జరిగిందని అలాగే భవిష్యత్తులో ఆదివాసులు అందరూ ఐక్యతతో పోరాటం చేయాలని తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని ఆదివాసి హక్కులను చట్టాలను కాలరాస్తున్నారని తెలియజేశారు ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నెంబర్ పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో లో సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య, రాజమ్మ ,పిసా కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఇతరులు పాల్గొన్నారు
Post A Comment: