మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 7 ఏళ్లు అయిన ఉదారవాద విధానాలు దూకుడుగా,క్రూరంగా అమలు చేస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలను విచ్చలవిడిగా ప్రైవేటికరిస్తూ కీలక రంగాల్లో విదేశీ పెట్టు బడులకు తలుపులు తెరిచికార్పొరేట్ కంపెనీల అధిపతులకు అప్పజెడ్పీతుందని ఈ క్రమంలో దేశాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి ఉందని కావున దేశ రక్షణకై జరుగుతున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి,సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య పిలుపునిచ్చారు.
పార్టీ కార్యాలయంలో సీపీఎం బిల్డింగ్ వర్కర్స్ శాఖ మహాసభ జరిగింది.ఈ మహాసభను ఉద్దేశించి వారు మాట్లాడారు.ఈ సందర్భంగా రైతు,కార్మిక వ్యతిరేక వ్యవసాయ చట్టాలను లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,విద్యుత్ చట్ట సవరణను ఆపాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీకి 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని గ్యాస్ అన్నారు.డీజిల్,పెట్రోల్,వంట గ్యాస్ ఇతర నిత్యావసర సరుకుల ధరలను అరికట్టాలని అన్నారుఅన్నారు.ఈ సభలో పార్టీ మండల కార్యదర్శి తాళ్లూరి కృష్ణ,ఆలేటి కిరణ్, నాగరాజు,మోహన్ రావు,మైముద్,లక్ష్మణ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: