*✍️దరఖాస్తులకు ఆహ్వానం సింగరేణి జిఎం వెల్ఫేర్ బసవయ్య.
భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు 21 (మన్యం మీడియా)
భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి ఆధ్వర్యంలో మంథని జేయన్ టియుహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో సింగరేణీయుల పిల్లలకు బీటెక్ కోర్స్ లలో 17( సూపర్ న్యూమరరీ) సీట్లు కేటాయింపు జరిగిందని అధికారి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ 2021-22 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సింగరేణి కార్మికుల పిల్లలకు సింగరేణి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంథని జేయన్ టియుహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ కోర్సుల యందు 17 ప్రత్యేక సీట్లు కేటాయించబడినట్లు సింగరేణి జిఎం వెల్ఫేర్ బసవయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి కార్మికుల పిల్లలకు బీటెక్ కోర్స్ ల సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. మైనింగ్ ఇంజినీరింగ్
02 సీట్లు, సివిల్ ఇంజినీరింగ్ 03 సీట్లు, మెకానికల్ ఇంజినీరింగ్ 03 సీట్లు, కంప్యూటర్ అండ్ ఎలక్ట్రోనిక్స్ - 03 సీట్లు,
కంప్యూటర్ సైన్స్ -03 సీట్లు,
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
(ఆర్ట్ ఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్)- 03 సీట్లు, సింగరేణి అధికారుల, కార్మికుల పిల్లలకు మైనింగ్ ఇంజినీరింగ్- 02 సీట్లు కేటాయించడం జరిగింది. అభ్యర్ధుల తల్లితండ్రులు వారు పనిచేసే డిపార్ట్ మెంట్ హెడ్ ద్వారా (త్రూ ప్రాపర్ చానల్) ధరఖాస్తులను నిర్ధేశించిన నమూనాలో ఎంసెట్-2020 మెరిట్ కార్డ్ జిరాక్స్ కాపీ జతచేసి సెప్టెంబర్ 04.09.2021 లోగా జిఎం హెచ్ఆర్డి
కార్పోరేట్ ఆఫీస్లో అందజేయాలని జిఎం వెల్ఫేర్ బసవయ్య తెలియజేశారు.
Post A Comment: