నీళ్లు రాకపోతే నాకు సమాచారం ఇవ్వండి ఆళ్ల పల్లి ఎంపీపీ మంజుభార్గవి
గుండాల/ ఆళ్ల పల్లి ఆగస్టు 3 (మన్యం మనుగడ) ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథ పథకం రూపకల్పన జరిగిందని ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి అన్నారు. బుధవారం మండలం పరిధిలోని మర్కోడు గ్రామంలో గల దళిత కాలనీ కి మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బంది పడటం తో మర్కోడు సర్పంచ్ శంకర్ బాబు మరియు ఏ ఈ కిషోర్ తో కలిసి ఆమె సందర్శించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వచ్చే విధంగా చూడాలని ఆమె కోరారు. మండలంలో మిషన్ భగీరథ నీళ్లు ఏ గ్రామంలోనైనా రాకుండా ఉంటే నాకు తెలియజేయాలని ఆమె కోరారు
Post A Comment: