మన్యం మనుగడ, పినపాక: ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని పినపాక మండలం లోని వివిధ పంచాయతీల సర్పంచులు వారి వారి గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఆదివాసి జెండాను ఆవిష్కరించి వేడుకలను జరుపుకున్నారు. పినపాక మండలం లోని పొట్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కళ్యాణి కిష్టాపురం పంచాయతీ సర్పంచ్ సుతారీ సుశీల, పాండురంగాపురం సర్పంచ్ ఈశం భవతి వారివారి పంచాయతీలలో జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వారి పంచాయతీల ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: