👉మాస్కుల పంపిణీ
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని తోగ్గూడెం పంచాయతీకి చెందిన అదివాసి గ్రామం టేకులగూడెం లో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు.టేకులగూడెంలోని బాల వెలుగు పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అనంతరం బాల వెలుగు పాఠశాల పక్కనే గల మినీ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ చంద్రకళ ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తోగ్గూడెం పంచాయతీకి చెందిన ఎంపీటీసీ చింతపంటి సత్యం హాజరై ఆదివాసి ప్రజలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. అదేవిధంగా బాల వెలుగు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోలెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరోనా కాలంలో రక్షణ కవచాలుగా ఉండే మాస్క్ లను పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటిస్తూ జెండా పండుగ కార్యక్రమంలో సంతోషంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోగ్గూడెం పంచాయతీకి చెందిన సతీష్, రమేష్, కలం సాంబ, బాల వెలుగు పాఠశాల ఉపాధ్యాయులు, టేకులగూడెం ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: