మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో మణుగూరు క్యాంపు కార్యాలయంలో టిఆరేస్వి సమావేశం ఏర్పాటు చేసినట్టు పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్ తెలిపారు.ఈ కార్యక్రమంలో విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిధిగా పాల్గొంటారు అని తెలిపారు.యువజన నాయకులు,సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.సమావేశ అనంతరం యువజన శాఖ అన్ని మండలాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి,పార్టీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తూ,భవిష్యత్ లో పినపాక నియోజకవర్గ పార్టీ విజయానికి యువజన విభాగం కీలక భూమిక పోషించే విదంగా సమాయత్తం చేయుటకు నిర్ణయాలు తీసుకోనున్నటు తెలిపారు.తప్పని సరిగా యువజన నాయకులు అందరూ హాజరు కవలసిందిగా రుద్ర వెంకట్ కోరారు.
Post A Comment: