బిటిపిఎస్ భూ నిర్వాసిత నిరుద్యోగులకు, ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు,పినపాక మండలాల సరిహద్దుల్లో గల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో బుధవారం ఉదయం 9 గంటలకు బిటిపిఎస్ భూ నిర్వాసిత నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయానున్నారు అని మణుగూరు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు తెలిపారు.ఈ సందర్భంగా సాంబయిగూడెం నుంచి విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ర్యాలీ కార్యక్రమం ప్రారంభమై,తదుపరి బిటిపిఎస్ సిఈ బాలరాజు కార్యాలయం వద్ద నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహించబడుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మణుగూరు జడ్పీటీసీ పోశం.నరసింహారావు కోరారు.
Post A Comment: