మన్యం టీవీ మంగపేట.
అన్ని ధానాలలో కన్నా అన్న దానం మిన్న అనే వారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిల్లో అన్ని ధానాలలో కన్నా రక్త దానం మిన్న, రక్త దానం చేయడం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. అమ్మ జన్మనిస్తే రక్త ధాత పునర్జన్మనిస్తాడు.
ఎంత దానం చేసిన తరగని అస్తి రక్తం ఆపదలో ఉన్న వారికి అదే అమృతం రక్తదానం ఎందరో ప్రాణాలను కాపాడుతుంది.
రక్తదాన శిబిరానికి విచ్చేయండి ప్రాణ దాతలుగా మారండి!
రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్(ఆర్ కే పి ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం లో ఆసక్తి కలిగిన వారు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా ఈసందర్బంగా ఆర్కెపి ములుగు, భూపాలపల్లి శాఖ వారు ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు.
మంగపేట మండల కేంద్రము కోమటిపల్లి ఎక్స్ రోడ్డు లో గల అగాఫే ఫూల్ గాస్పల్ చర్చ్ లో ఆగస్ట్ 15 తేదీ న స్వాతంత్ర దినోత్సవం రోజున ఉదయం 10 గంటలకు రక్త దాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాము మండలంలోని ప్రజలు రక్తదానం చేయడానికి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పత్రిక ముఖంగా కోరారు.
ఈ కార్యక్రమంనకు అహ్వనించువారు
ఆర్ కే పి ములుగు&భూపాలపల్లి అధ్యక్షులు
పసుపులేటి శ్రీనివాసరావు
9963981347
సుంకోజు ద్రోణాచారి
8985026468.వివరాలకు స్వయంగా గాని లేదా ఇక్కడ ఇచ్చిన నెంబర్ లకు కాల్ చేసి తెలుసుకోవలసినదిగా కోరారు.
Post A Comment: