CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సమస్యపై చలో కలెక్టరేట్ విజయవంతం చేయండి

Share it:

 


 న్యూ డెమోక్రసీ నాయకులు శంకరన్న

 గుండాల ఆగస్ట్ 7 (మన్యం మనుగడ) పోడు భూముల సమస్యపై న్యూ డెమోక్రసీ పార్టీ తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సబ్ డివిజన్ నాయకులు శంకరన్న పిలుపునిచ్చారు. శనివారం మండలంలో కాచన పల్లి మరియు ముతపురం గ్రామాల్లో పోడు పోరు పోస్టర్ను  ఆవిష్కరించారు. ఆదివాసి దినోత్సవాన్ని ఆదివాసి హక్కుల పరిరక్షణ దినంగా జరపాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో పట్టా వున్న భూములను సైతం తీసుకొని మొక్కలు నాటడం దారుణమన్నారు. ఆదివాసీలపై దాడులు చేస్తున్న ఫారెస్ట్ అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొమరం శాంతయ్య , బుర్ర వెంకన్న , ఎనుగంటి గణేష్ , కోడూరి జగన్, పూనెం మంగయ్య , తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: