👉హద్దుమీరి మాట్లాడితే తగిన బుద్ది చెప్తాం
టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల నాయకులు చల్లకోటి పూర్ణచంద్ర రావు
మన్యం మనుగడ,బూర్గంపహడ్:
తెలంగాణా ప్రభుత్వ విప్,పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి మీద అనవసర విమర్శలు చేసిన,హద్దుమీరి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ది చెప్తామని టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల నాయకుడు చల్లకోటి.పూర్ణ చంద్రరావు అన్నారు.గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...పినపాక నియోజకవర్గం అభివృద్ది పధంలో ముందుకు పోతుందన్నారు.కేవలం రేగా కాంతారావు గారికి ఉన్న పట్టుదలతోనే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు.సాగునీటి ప్రాజెక్టులు మంజూరు,మణుగూరు పట్టణంలో పలు అభివృద్ది పనులు మంజూరు,భద్రాద్రి పవర్ ప్లాంట్లో భూ నిర్వాసితులకు ఒకేసారి 309 మందికి పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పించడం అదే కాకా కాంతారావు గారి నేతృత్వంలో ఎన్నో మట్టి రోడ్లు బురద మయం అయ్యే రోడ్లు CC రోడ్లు గా మారిన విషయం ప్రతి పిల్లవాడికి సైతం తెలిసిందే ఇదంతా కేవలం రేగా కాంతారావు గారి పట్టుదలతోనే సాధ్యమయ్యయన్నారు.నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది తెలుసుకోకుండా రేగా కాంతారావు గారిపై హద్దుమీరి మాట్లాడితే అందుకు తగిన విధంగా ప్రతి చర్య ఉంటుందన్నారు.నిన్న మొన్న వచ్చిన గ్రామ స్దాయి కాంగ్రేస్ నాయకులు విమర్శిస్తే సంహించేది లేదని ప్రజలు రానున్న రోజుల్లో సరైన బుద్ది గుణపాఠం చెప్తారన్నారు.
Post A Comment: