మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన తులసిగారి సత్యవతి(53) పాముకాటుకు గురై శుక్రవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యవతి గత రెండు రోజుల క్రితం తన సొంత పొలంలో వరి నాటు పీకడానికి వెళ్లిన క్రమంలో పాము కాటుకి గురైంది వెంటనే కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం కి తరలించారు సత్యవతి అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మృతురాలికి భర్త దుర్గయ్య ఇద్దరు కుమారులు ఉన్నారు
Post A Comment: