విప్ రేగా కాంతారావు ఆదేశాలు..అప్రమత్తమైన వైద్య శాఖ
మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం మల్లారం గ్రామ పంచాయతీలో జానంపేట ప్రాథమిక కేంద్ర వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు,శృతి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 39 మందికి జ్వర వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ గా నమోదయ్యాయని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనా వ్యాప్తి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు
Post A Comment: