మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లాలో ములుగు నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ఏజెన్సీ దళితులను ఏరోజు కూడా ఏజెన్సీ దళితులను పట్టించుకునే పాపనపోలేదు.
ఏజెన్సీ లో పూర్వం నుండి ఆదివాసీలు దళితులు వారికి చెప్పులు కుట్టి, వారి వ్యవసాయా నాగటికి ఆరేం తాడు అంటే ఎద్దు శర్మంతో చేసిన చెప్పులు తాడు ఇచ్చిన చరిత్ర గలదు మా దళితులది.
*సీతక్క స్థానిక ఎమ్మెల్యే గా ఉండి కూడా ఏజెన్సీ దళితుల గురించి ఏ రోజున కూడా అసెంబ్లీలో మాట్లాడ లేదు ఎందుకు అంటే ఆనాడు 2006లో ఒక చట్టం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తీసుకు రావడం జరిగింది అపుడు మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంది*
ఆనాడు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2006 అటవీ హక్కుల చట్టాన్ని ఎందుకు ఏజెన్సీ దళితులకు వర్తింపు చేయలేదు.ఈ చట్టం గురించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మ దళితులకు తెలియదా? ఈ రోజున మాట్లాడుతున్నారు మా దళిత లీడర్లు? సీతక్క పట్టించుకోవడం లేదు అని ఏ డి ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అంటే తప్పోచ్చిందా దళిత లీడర్లకు.?
ఏరోజున కూడా స్థానిక ఎమ్మెల్యే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితులను వారి బాధలను వారి గూడలను కూడా పట్టించుకోకుండా ఉన్నరు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో సహా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రాజకీయాల పార్టీలకు తగిన బుద్ధి చెపుతామని ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు
పరికి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు.ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళిత బహుజన వర్గాలను పట్టించుకోకుండా ఉంటే రానున్నది ముసలా పండుగ అని పత్రిక ముఖంగా తెలియజేసారు.
Post A Comment: