మన్యంటీవీ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్ఛ నాగేశ్వర రావు ఈ రోజు అశ్వారావుపేట నందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ని ఎగరవేసారు. అనంతరం అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్ లో గల గురుకుల మైనార్టీ పాటశాల మరియు కాలేజ్ నందు జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని ఎందరో మహానుభావుల త్యాగ ఫలంతో మనం ఈ రొజు స్వేచ్ఛగా స్వతంత్రం గా వుండ గలుగుతున్నమని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటూ అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మీ, మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్, సర్పంచు లు, ఎంపిటిసి లు మండల నాయకులు, అధికారులు పోలీస్ సిబ్బంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: