మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చేగర్శల గ్రామానికి చెందిన ఆవుల వీరమ్మ భర్త కొన్ని రోజుల క్రితం చనిపోవడంతో ఒంటరి అయినది. దానికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు వీరమ్మ కు చెందిన గుడిసె కూలిపోవడంతో
నిరాశ్రయురాలు అయింది. నా అనేవారు లేక గూడు కోసం ఎదురుచూస్తున్న వీరమ్మ కు పినపాక మండల జడ్పిటిసి దాట్ల సుభద్రాదేవి-వాసుబాబు రూపంలో అదృష్టం వరించింది. వీరమ్మ భర్త చనిపోవడం, వర్షాలకు ఇల్లు కూలిపోవడం గురించి విషయం తెలుసుకున్న వాసుబాబు దంపతులు శనివారం రోజున చేగర్శల లోని వీరమ్మ దగ్గరకు వెళ్ళి, పరిస్థితిని గమనించి, వెంటనే స్పందించి గృహనిర్మాణానికి కావలసిన ఇనుప కడ్డీలు, రేకులను తెప్పించడం జరిగింది. అంతేకాక గృహ నిర్మాణం నిమిత్తం 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా వీరమ్మకు అందజేయడం జరిగింది.వీరమ్మ పరిస్థితి గమనించి వెంటనే స్పందించిన దాట్ల వాసు బాబు దంపతులకు, వారు చూపించిన దాతృత్వానికి, చేగర్శల గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు
Post A Comment: