👉పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
మన్యం టీవీ కొత్తగూడెం, ఆగస్టు 7:-
శనివారం నాడు స్థానిక సి ఆర్ క్లబ్ లో ఆషాడ మాసం చివరి రోజు సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సేవా కార్యదర్శి సుమ భాను ఆధ్వర్యంలో గోరింటాకు పోటీలను నిర్వహించారు.
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, సి పీ డి ఓ,కనకదుర్గ, సేవా అధ్యక్షురాలు మరీ పద్మజ శంకర్ హాజరైనారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మరుగున పడ్డ గోరింటాకు కలలను తిరిగి సేవా సభ్యుల ద్వారా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు ప్రతి ఒక్కరు గోరింటాకు చెట్లు నాటడం ద్వారా కాళ్లకు చేతులకు వచ్చే చర్మవ్యాధులను అరి కట్టుకోవచ్చని అన్నారు.
సేవా అధ్యక్షురాలు పద్మ శంకర్ తమ సేవా సభ్యుల ద్వారా పేద మహిళలకు వృత్తి విద్య కొరకు శిక్షణ ఇచ్చి ఉపాధి పొందేలా చేయడం మరియు ఇక్కడికి వచ్చి పోటీలో పాల్గొన్న వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు చైర్ పర్సన్ మరియు కార్పొరేట్ సుమ భాను చే బహుమతులను అందజేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో కార్పొరేటర్ సేవా కార్యదర్శి సుమ భాను, ఎంపీటీసీ కొల్లు పద్మ, రమా, శ్రీలత జ్యోతి, టీచర్ పద్మ, కవిత మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: