- విప్ రేగా కాంతారావు ను కలిసిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యులు
- హైపవర్ వేతనం అమలు కు కృషి చేయాలని విప్ రేగా కు వినతి పత్రం అందజేసిన సభ్యులు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల హైపవర్ వేతనం అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం తరపున డివిజన్ ఉపాధ్యక్షులు గూడెల్లి.యాకయ్య,ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాజిత్, కోశాధికారి భానోత్ అనిల్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మోరె.భాస్కర్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా. కాంతారావు ను కలిసారు.ఈ సందర్భంగా సింగరేణి లో అన్ని ఏరియాల లో కలిసి సుమారు 35 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు అని,వీరంతా చాలీ చాలని జీతాలతో జీవితాలను వెళ్లదీస్తున్నారని అన్నారు.సింగరేణి కార్మికుల తో సమానంగా పని చేయించుకుంటూ ఉన్నప్పటికీ,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన, కోల్ ఇండియాలో అమలవుతున్న జెబిసిసిఐ కి జాతీయ కార్మిక సంఘాలు, యాజమాన్యం సంతకాలు చేసినప్పటికీ,హై పవర్ వేతనం సింగరేణి లో అమలు చేయడం లేదు అని తెలిపారు.కావున మా సమస్యని సీఎం కేసీఅర్ కు తెలియజేసి,మాకు హై పవర్ వేతనాలు అమలు అయ్యే విధంగా మీరు కృషి చేయగలరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో తురక కోటి,సమ్మయ్య,సిరికొండ. శ్యామ్ సుందర్ రావు, వినోదు,రాజా,కొమురయ్య, వెంకటరమణ,అల్లా బక్షి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: