చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పూనెం లింగన్న ఆశయాలను సిద్ధాంతాలను నెరవేరుస్తామని జిల్లా న్యూడెమోక్రసీ నాయకులు ఎస్కే ఉమర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో లింగన్న రెండో వర్ధంతి సందర్భంగా వర్ధంతి సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్కే ఉమర్ పాల్గొని లింగన్న కు ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం ప్రతిఘటన పోరాటయోధుడు లింగన్న ను కేసీఆర్ ప్రభుత్వం పట్టుకొని అమానుషంగా ఎన్ కౌంటర్ చేసి హతమార్చాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఎన్ కౌంటర్ లు ఉండవని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వరికూటి వెంకట్రావు, డి బాలు, జి లక్ష్మణ్, టి వెంకటేశ్వర్లు, టి భీముడు, హర్యా, కిషన్, బద్రు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: