మన్యం టీవీ కరకగూడెం: మండలరిదిలోని రేగళ్ళ గ్రామపంచాయతి లో గల మారుమూల గ్రామలు అయిన మర్రిమోదలు,పడిగపూరం గ్రామాలలో వైద్య శిబిరం,కోవిడ్ వ్యాక్సిన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కరకగూడెం ప్రభుత్వ వైద్యులు డా,,పర్షియా నాయక్ తన సిబ్బందితో కలిసి గ్రామాలోని ఇండ్లలో నిల్వ ఉన్న నీటినిలువ గుర్తించి వాటిని తొలగించడం జరిగిందన్నారు. అనంతరం 76 మందిని పరీక్షించి 12 మందికి రక్త పూతలు తీయడం జరిగినదని అలాగే 70 మందికి కోవిడ్ వాక్సిన్ వేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ,కాచి వాడబోసిన నీరుని త్రాగలని సూచించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి భద్రమ్మ హెచ్ ఎ కృష్ణ ఎఎన్ఎమ్ రుక్మిణీ, జ్యోతి, నాగారత్నం సుజాత పంచాయతీకి సెక్రటరీ శ్రీకాంత్ ఆశా కర్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: