ప్రభుత్వం ఆదుకోవాలని విన్నపం
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం పొదుమూర్ గ్రామం దాసరి రవి తండ్రి మమత ల కు ముగ్గురు పిల్లలు వారిలో ఇద్దరు అమ్మాయిలకు చెవులు వినబడవు, మరియు మాటలు రావు. హైదరాబాదు వెళ్లి టెస్ట్లు చేపిస్తే ఇద్దరి పిల్లలలకు మాటల రావు చెవులు వినబవు అని చెప్పారు. వారికి డాక్టర్స్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. దాసరి రవి మమతలు తండ్రి మరియు ఇద్దరు పిల్లలు మొత్తం ముగ్గురు వికలాంగులు ఒకటే కుటుంబంలో పింఛన్స్ కోసం అప్పులు చేసి దరఖాస్తు చేశారు కానీ వస్తున్నట్లు సర్టిఫికెట్స్ ఇచ్చారు కానీ ఇంతవరకు రావడం లేదు. మంగపేట కార్యదర్శి ని ఈ విషయం పై విచారణ చేయగ వచ్చే నెలపెన్షన్ వస్తుంది అని చెపుతున్నారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది వారు వారి పిల్లలను కూలి పని చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నారు.
ఈ బాధ చూడలేక డాక్టర్ దగ్గరికి వెళితే పిల్లల ఆపరేషన్ కు 10 లక్షలు అవుతావి అన్నారు. మరొకరికి చెవిలో మిషన్ పెట్టాలి. అన్నారు.ఇటువంటి పేదవారిని, మాటలు రావు, చెవులు వినబడవు వీరికి ప్రభుత్వంద్వారా వీరి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయాలి, అదే విధంగా దాతలు ముందుకు వచ్చి వీరి కుటుంబానికి ఆర్ధిక చేయూతనివ్వాలని అని ఎమ్మార్పీస్ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ పత్రికాముఖంగా కోరారు.
Post A Comment: