CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేడు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ సమావేశానికి సాంబశివ రెడ్డి....

Share it:

 



 హాజరుకానున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు...

మన్యం టీవీ మంగపేట.


నేడు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నడికుడి దాచేపల్లి లలో జరగనున్న జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి హాజరవుతున్నట్లు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి రాజ్యసభ ఎంపీ జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ జివిఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వై ఎస్ ఆర్ సి పి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గురజాల వై ఎస్ ఆర్ సి పి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పైసెస్ బోర్డ్ రీసెర్చ్ డైరెక్టర్ శ్రీమతి రమాశ్రీ గుంటూరు స్పైసెస్ బోర్డు రీజనల్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి పద్మజ రాణి తెలంగాణ నుండి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాది లింగప్ప మరియు ఆంద్ర ప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మిర్చి ఎక్స్ పోర్టర్ లు, ప్రాసెసర్లు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్లు ఎంపిక చేసిన అభ్యుదయ మిర్చి ఉత్పత్తిదారులు ఎఫ్ పి ఓ సభ్యులుపాల్గొననున్నట్లు తెలిపారు మిర్చి లో విల్ట్ వైరస్ తెగులును తట్టుకునే నూతన వంగడాల విత్తన సరఫరా ఆత్మ నిర్బర్ భారత్ ద్వారా కేటాయిస్తున్న నిధులు పథకాల వివరాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో సుగంధ పంటలుగా మిర్చి పసుపు సాగు చేస్తున్న రైతుల సమస్యలపై తన వాణిని బలంగా వినిపిస్తానని తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు సాధించేందుకు కృషి చేస్తానని సాంబశివ రెడ్డి తెలిపారు.

Share it:

Post A Comment: