CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బిడ్డా... నీవ్వు లేని లోకం మాకెందుకు

Share it:



👉 కూతురు మృతి తో..తల్లడిల్లిన ఆ తల్లిదండ్రులు

👉 గోదావరి లో దూకి బలవన్మరణం

👉బూర్గంపాడు గోదావరి పరివాహక ప్రాంతంలో రెండు మృతదేహాలు

మన్యం మనుగడ, బూర్గంపాడు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పాల్వంచ పరిధిలోని స్వాతి స్కూల్ వెనుక భాగంలో నివాసముండే BTPS మణుగూరు లో ఎ డి ఈ గా పనిచేస్తున్న దురుసోజు వేమన కుమార్  ఇంటికి హైదరాబాదులోని ఈసీఐఎల్ నివాసముండే తన అక్క బావ అయినటువంటి పమ్మి హేమలత (48) మరియు పమ్మి లక్ష్మణా చారి (55) వచ్చి ఉన్నారు. సుమారు పది రోజుల క్రితమే వాళ్ళ పాప అనారోగ్యంతో చనిపోవడంతో పాప లేని లోటు తో కలత చెందిన అక్క బావ మనసులో బాధతో ఉండేవారని వామనకుమార్ తెలియ చేశారు. ఈ క్రమంలో 04-08-2021 న తన డ్యూటీ నిమిత్తం తాను మణుగూరు మరియు అతని భార్య అదే రోజు హైదరాబాద్ వెళ్లారని చెప్పారు. సదరు అక్క బావ పాల్వంచలోని వీరి ఇంటిలో ఒంటరిగానే ఉన్నారని అదే రోజు సాయకాలం నాలుగు గంటల సమయానికి వామనకుమార్ డ్యూటీ నుంచి అక్క బావ కు కాల్ చేయగా వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తో అనుమానం వచ్చిన వామన కుమార్ తన బావమరిది ని ఇంటికి పంపించి ఆరాతీయగా సదరు అక్క బావ ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టి వారి పర్సు మరియు ఫోన్లు అక్కడే వదిలి పెట్టి వెళ్లిపోయారని బావమరిది ద్వారా తెలుసుకున్న వామన కుమార్ వారి కోసం వెతికి నేడు 05-08-2021 న పాల్వంచ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వారు సి ఆర్ నెంబర్ 275/ 2021 మ్యాన్ అండ్ ఉమెన్ మిస్సింగ్ కేసును రిజిస్టర్ చేసినారు. పోలీసువారి దర్యాప్తులో ఈ రోజు చీకటి పడే సమయానికి బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి నది ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల దేహాలు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పాల్వంచ పోలీసువారు ఈ విషయాన్ని బూర్గంపాడు పోలీస్ వారికి తెలియచేశారు. బూర్గంపాడు ఎస్సై జితేందర్ మరియు సిబ్బంది మృతదేహాల వద్దకు చేరుకొని ఫోటో ఆధారంగా అమృత దేహాలు పమ్మి హేమలత మరియు లక్ష్మణాచారీ గా గుర్తించారు.

Share it:

TELANGANA

Post A Comment: