CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సగంలోనే ఆగిపోయిన పనులు..ఇది ఇది ఎత్తిపోతల పథకం పరిస్థితి

Share it:



 గుండాల ఆగస్టు 5 (మన్యం మనుగడ)  :
నీరు ఎత్తింది లేదు పోసింది లేదు. పేరు ఎత్తిపోతల పథకం సగంలోనే ఆగిపోయిన పనులు. ఏండ్లు గడుస్తున్నా ఫుట్బాల్ బిగించ క అర్ధాంతరంగా ఆగిపోయిన  ఎత్తిపోతల పథకం. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో మల్లన్న వాగుపై నిర్మించిన ఎత్తిపోతల పథకం ఫుట్బాల్ విధించక పోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. 30 సంవత్సరాల నాటి పథకాన్ని  గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా పథకానికి 11 లక్షల 90 వేల రూపాయలు నిధులు కేటాయించి  2017 లో పథకం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు ఫుట్ బాల్స్  బిగించ కాకపోవడంతో మోటర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. దీనికితోడు వాగు లోనే నిర్మించడంతో గత సంవత్సరం మల్లన్న వాగు ఉప్పొంగడంతో  తడవకుండా ఉండేందుకు నిర్మించిన గది సైతం మునిగిపోయి మోటార్లు తడిసిపోయాయి.  ఈ ఎత్తిపోతల పథకం కింద 30 రైతుల కు చెందిన ఎనభై మూడు ఎకరాల భూమి ఉంది ఎత్తిపోతల పథకం ప్రారంభమైతే వర్షాలు లేని దానికి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. దీనికి దిగువనే  పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  గారు నిధులు కేటాయించి నిర్మించిన చేద్దాం నిండుకుండలా ఉన్నప్పటికీ  నీళ్లు ఎత్తి పోయడానికి పథకం అందుబాటులో లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు

Share it:

TELANGANA

Post A Comment: