మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో బుధవారం ములుగు తెరాస పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీశ్వర్ చొరవతో మంజూరు చేయించిన సి.ఎం .ఆర్.ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మంగపేట మండలం రాజుపేట, గ్రామానికి చెందిన మలికంటి శంకర్ కు అందజేశారు. అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని దానికి సంబంధించిన మెడికల్ బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధి కుసుమ జగదీశ్వర్ పంపించి మంజూరు చేయించ బడిన.రూ 20,000 ల చెక్కును టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో బుధవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవిందా నాయక్ , మంగపేట మండల ఇంచార్జ్ తుమ్మ మల్లరెడ్డి చేతుల మీదగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గోవిందా నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వర ప్రాధాన్యత ఉందని అన్నారు కార్యక్రమంలో ,జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ ,పి ఏ సి ఎస్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ,తోట రమేష్ ,కడబోయిన నరేందర్ ,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,కుంట ఏడుకొండలు, ఉడుగుల శ్రీనివాస్ , మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి,కన్నా సంపత్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: