CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మూడో రోజు దీక్ష

Share it:

 


 మన్యంటీవీ, అశ్వాపురం:ఈరోజు షెడ్యూల్ కులాల సమగ్రాభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో మూడో రోజు దీక్ష లు చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఈ సం పల్లి కృష్ణ మాదిగ మాట్లాడుతూ హుజురాబాద్ లో ఎన్నికల నోటిఫి కేషన్ ముందే అక్కడ దళిత బందు పూర్తిచేయాలని అదేవిధంగా వంద రోజుల్లో రాష్ట్రంలోని ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అటువంటి దళిత బందును అన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేయాలని.ప్రతి పేద కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, అర్హులైన వారికి మూడెకరాల భూమి ఇవ్వాలని అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు. రావులపల్లి వెంకట నరసయ్య మాదిగ. ఎస్సీ సెల్ నాయకులు గద్దల రామకృష్ణ మాదిగ. వికలాంగుల అధ్యక్షులు పోకల వెంకటేశ్వర్ల మాదిగ ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు మిరియాల వెంకటేశ్వర్లు మాదిగ. ఎమ్మార్పీఎస్ యూత్ సభ్యులు చుంచు ప్రవీణ్ మాదిగ మహిళా విభాగం నుండి. ఈ సం పల్లి కళ్యాణి మాదిగ. ఈరోజు శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించిన వారు.సీపీఎం పార్టీ నాయకులు గద్దల శ్రీను. అదేవిధంగా పీఏసీఎస్ ఉపాధ్యక్షులు గాదె వెంకటరెడ్డి. జేఏసీ రాష్ట్ర నాయకులు నాయకులు గద్దల నాగేశ్వరరావు తదితరులు ఈ రోజు దీక్షకు మద్దతు పలికారు.

Share it:

Post A Comment: