*ఆగస్టు 12న అవార్డు అందుకోనున్నారు.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల గ్రామానికి చెందిన ములుగు జిల్లా ఎంపీటీసీల అధికార ప్రతినిధి కన్నాయిగూడెం మండలం వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్ ఆదర్శ కీర్తి నేషనల్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల ములుగు జిల్లా మరియు కన్నాయిగూడెం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువ నాయకులు బొల్లె భాస్కర్ ఎంపీటీసీల హక్కుల సాధనకు, వివిధ రంగాలలో చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఆదర్శ కీర్తి అవార్డు 2020-2021 కి ఎంపిక చేయడం జరిగిందని, సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆదర్శ కళానిలయం హైదరాబాద్ వారి సహకారంతో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి హైదరాబాద్ లో ఈ నెల ఆగస్టు 12న అందుకోనున్నారు.
Post A Comment: