జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో ఇటీవల దాతలు నాశిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి సాంబశివ రెడ్డి భూదానం చేసి నిర్మించిన కీర్తిశేషులు నాశిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి స్మారక వైకుంఠధామం లో కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్కని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి అకినేపల్లి మల్లారం గ్రామస్థులతో కలిసి కోరారు. ఈ మేరకు మంగళవారం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క ను కలిసి వినతి పత్రం అందజేశారు. రూపాయలు 25 లక్షల విలువైన ఎకరా భూమిని విరాళంగా ఇవ్వడంతోపాటు వైకుంఠధామానికి అవసరమైన రహదారి వైకుంఠధామం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు హరితహారం కార్యక్రమం లో భాగంగా 200 మొక్కలు నాటించడం జరిగిందని ఎమ్మెల్యేకు వివరించారు. ప్రస్తుతం వైకుంఠధామం లో ఒక బోరు బర్నింగ్ ప్లాట్ఫామ్స్ మరియు ఒక షెడ్డు నిర్మించాల్సి ఉందని ఇందుకోసం అకినేపల్లి మల్లారం గ్రామపంచాయతీ నుండి నిధుల వినియోగానికి ఇప్పటికే తీర్మానించినందున జిల్లా కలెక్టర్ నుండి అనుమతి మంజూరు చేయాలని లేదా సిడిపి నుండి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారని లేదా తన నిధుల నుండి వైకుంఠ దామం లో కనీస సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల కుమార స్వామి అకినేపల్లి మల్లారం గ్రామస్తులు నాశిరెడ్డి నాగిరెడ్డి లక్కీ వెంకన్న లక్కీ అనిల్ షేక్ మొయినుద్దీన్ మదార్ సాహెబ్ తదితరులు ఉన్నారు.
Post A Comment: