👉 తమ చిన్ననాటి విద్యాబుద్ధులు నేర్పిన విశ్రాంత గురువులకు ఘన సన్మానం..
మన్యం టీవీ :జూలూరుపాడు, ఆగస్టు 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు.ఈ సందర్భంగా తమకు చిన్ననాటి విద్యాబుద్ధులు నేర్పిన విశ్రాంత గురువులను గౌరవంగా శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాటం తో వచ్చిన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామని, స్వాతంత్రోద్యమంలో ఎందరో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్నారని,అలాంటి వారిని స్మరించుకుంటూ మెకానిక్ అసోసియేషన్ సభ్యులందరూ సేవా కార్యక్రమాలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరికి స్వీట్లు మిఠాయిలు పంపిణీ చేశారు.
Post A Comment: