నీకు నేను రక్ష నాకు నీవు రక్ష మనమందరం దేశానికి రక్ష
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం కమలాపురంలో ఆదివారం రోజున రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని భారతీయ మజ్దూర్ సంఘ్ జాయింట్ సెక్రెటరీ రామిడి సురేష్ ఆధ్వర్యంల ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు
ఉదయం 6 గంటల నుండి ప్రారంబమైన ఉత్సవాలు మొదటగా బిల్ట్ ఫ్యాక్టరీ గేటు దగ్గర బిల్ట్ కార్మికులకు రాఖీలు కట్టిన అనంతరం గ్రామంలోని పెట్రోల్ బంక్ నుండి ఆటో స్టాండ్ వరకు ఉన్న వ్యాపారస్తులకు మరియు బాటసారులకు రాఖీలు కట్టారు
రాఖీ కడుతూ నీవు నాకు రక్ష... నేను నీకు రక్ష... మనమంతా ఈ దేశానికి సమాజానికి రక్ష... అంటూ రాఖీలు కట్టారు ఈ కార్యక్రమంలో రామిడి సురేష్, లింగంపల్లి శ్రీనివాస్ భువనగిరి యాదగిరి వడిచర్ల వెంకట మల్లు శంకర్ వెంకటేశ్వర్లు మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: