*నేతకాని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జిమ్మిడి ప్రకాశ్
మన్యం టీవీ కరకగూడెం: దళిత విద్యార్ధిని రమ్య ను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నేతకాని విద్యార్థి విభాగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జిమ్మిడి ప్రకాశ్ అన్నారు. అయన విలేకర్ల తో మాట్లాడుతూ 75 వ స్వతంత్ర దినోత్సవం నాడు గుంటూరు జిల్లా కేంద్రంలో బీటెక్ విద్యార్థిని దళిత యువతి రమ్యను హత్య చెయ్యడం తీవ్రంగా కలిచివేసిందన్నారు.అర్ధరాత్రి ఆడపిల్లలు ఒంటరిగా బయటకు రాగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్న గాంధీ జీ మాటలు నీటీ మూటలేనా అన్నారు.ఆడపిల్లలు పట్టపగలు ఇండ్లలో ఉండాలన్న కూడా భయపడే పరిస్థితి ఉందని 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో దళితులకు,మహిళలకు రక్షణ లేదని ఆవేదన చెందారు. శాంతి భద్రతలు సమర్థవంతంగా నిర్వహించినప్పుడే దేశం గాని ,రాష్టాలు కాని సుభిక్షంగా ఉంటయన్నారు.బీటేక్ విద్యార్థని రమ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడిని పట్టుకోని కఠినంగా శిక్షించాలని మరో మహిళకు ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవలన్నారు.
Post A Comment: