మన్యం టీవీ,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలo రాష్ట్రంలో కాళీగా వున్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని,ఉద్యోగ నోటిపికేషన్స్ వెంటనే విడుదల చేయాలని,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని,
ప్రగతి శీల యువజన సంఘం(PYL).ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్ధిసంఘం(PDSU) రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా ఈరోజు రెండు సంఘాల ఆధ్వర్యంలో అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు ఇంటిని ముట్టడి చేయడం జరిగింది.MLA ఇంటి ముందు ధర్నా అనంతరం సమస్యల పై వినతి పత్రాన్ని MLA మెచ్చా నాగేశ్వరరావు ఇవ్వడం జరిగింది.మెచ్చా నాగేశ్వరరావు సమస్యలను ముఖ్య మంత్రి దృష్ఠికి తీసుకెల్లి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో PYL జిల్లా కార్యదర్శి పోతుగంటి లక్ష్మణ్,PDSU నాయకురాలు, K సంద్య పాల్గోని మాట్లాడుతు నీళ్లు నిదులు నియామాకల పేరుతో అదికారంలోకి వచ్చిన TRS ప్రభుత్వం అదికారం చేజిక్కాక పూర్తి గా వీటిని విస్మరించిందని రాష్ట్రంలో లక్షా తొంబై వేల ఉద్యోగాలు కాళీగా వున్నాయని.వీటిని వెంటనే భర్తీ చేయాలని ఎన్నికల హామీలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన *కెసీఆర్* ఇప్పటి వరుకు నిరుద్యోగులకు రావాలసిన భృతి లెక్కలు చూసి నిరుద్యోగులకు చెల్లించాలని అన్నారు.ఇప్పటికైన ప్రభుత్వాలు నిరంకుశ పోకడలు విడనాడి నిరుద్యోగ సమస్యలను పరిస్కరించాలని లేని యడల PYL,PDSU ఆద్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులతో ప్రగతి భవనం ముట్టడి కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో PYL జిల్లా నాయకులు కాక వెంకటేష్,వాసం బుచ్చిరాజు,బడిశ లక్ష్మణరావు,కుంజా,సున్నం జగన్,కాక రాజు,ఎదిరాజు నాగరాజు,PDSU నాయకులు కుంజా రాజ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: