మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రంలో ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ జన్మదిన వేడుకలు జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు కోలాహలంగాజరుపుకున్నారు.మొదట జిల్లా కేంద్రంలో లో కేక్ కట్ చేసి అనంతరం చైర్మన్ జగదీష్ పేరు మీద జాకారం శివారు లో గల గట్టమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు.తరువాత ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు.తరువాత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గారి జన్మదినం సందర్భంగా ఆయన పాలన ములుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా ఆయన చేసిన సేవ మీద కళాకారుడు గోల్కొండ బుచ్చన్న రచించి చంద్రశేఖర్ ఆజాద్ పాడిన పాటలతో కూడిన సిడి ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మరియు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గోవింద్ నాయక్ చేతులమీదుగా విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి ముడుతనపల్లి మోహన్,జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయ్ రామ్ నాయక్, వేల్పూరు సత్యనారాయణ,
టౌన్ అధ్యక్షుడు సంతోష్,శీలం మధు,రమేష్ రెడ్డి,గడ్డమీది భాస్కర్,మాడుగుల రమేష్,బొచ్చు సమ్మయ్య,
అంతటి రాము,పొలం శ్రవణ్, రేణిగుంట్ల సురేష్,బల్గూరి నవీన్ తదితర టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
Post A Comment: