👉పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలి.. ఐద్వా జిల్లా నాయకురాలు రేణుక..
మన్యం టీవీ దుమ్ముగూడెం ఆగస్టు7: దుమ్ముగూడెం మండలం ములకపాడు సెంటర్లో ఎలమంచిలి సీతారామయ్య భవనంలో దుమ్ముగూడెం మండల మహాసభ సుశీల నాగమణి అధ్యక్షతన జరిగిన మహాసభకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రేణుక ,ఎం జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు .వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్మహిళలపై దాడులు పెరుగుతున్నాయని వెంటనే దాడులను అరికట్టాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు దళిత ఎస్సై పై జరిగిన ఘటన పై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు మహిళలపై లైంగిక వేధింపులు అత్యాచారాలు దేశంలో రాష్ట్రంలో వరుస సంఘటనలు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవహిస్తున్నాయి అని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు. అలానే పెరిగిన నిత్యావసర సరుకులు గ్యాస్ ,డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని లేదంటే భవిష్యత్ మహిళలందరికీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రాజమ్మ సిఐటియు మండల కన్వీనర్ కొరస చిలకమ్మా, సర్పంచులు లు , కనకదుర్గా కల్లూరు దేవి ,మీడియం జయ, పార్వతి ,కాంతమ్మ ,వర్ష సుశీల ,మడి సుభద్ర ,వసంత తదితరులు
Post A Comment: