మన్యం టీవీ,బూర్గంపాడు:
ప్రపంచంలో కుటుంబం కన్నా స్నేహితుల బంధం విలువైనదని పృధ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ ఫౌండర్ బొల్లి పృధ్వి రాజ్ అన్నారు.స్నేహితుల దినోత్సవం వేడుకలు పృధ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్నేహితులందరిని పృధ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ ఒకే వేదికపైకి చేర్చిందని బొల్లి పృధ్వి రాజ్ అన్నారు.ఇప్పటికే మా ఆర్గనైజేషన్ తరపున స్నేహితులతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పృధ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ ఫౌండర్ బొల్లి పృధ్వి రాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వీరేంద్ర,చంద్రశేఖర్,నాగేంద్ర,
రామకృష్ణ, సందీప్,సాయి, కసిమ్,పవన్,బాలాజీ,వంశీ, రంగ,దుర్గారావు,యాసిన్,
అన్వేష్,హరీష్,అజయ్,సతీష్ ,మరియు మిత్ర బృందం పాల్గొన్నారు.
Post A Comment: