మన్యం టీవీ,బూర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో బూర్గంపాడు మండల కేంద్రంలో గల టిఎస్ రెసిడెన్షియల్ పాఠశాల & జూనియర్ కళాశాలను మరియు జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలను సందర్చించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.
అనంతరం విద్యాసంస్థలు తెరిసిన తర్వాత పాఠశాలలోని విద్యార్థులకు జ్వర సూచన ఉంటే అయా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని జడ్పీటీసీ సూచించారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులు శానిటేషన్ చేసుకోవడం,మాస్కులు విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణ చర్యలను విధిగా పాటించాలన్నారు,పారిశుద్ధ్యం బాధ్యత అయా గ్రామ పంచాయతీ సర్పంచులదే అని సూచించారు.అదే విధంగా ఉపాధ్యాయులు అందరూ వంద శాతం హాజరై గ్రామ పంచాయతీ సిబ్బందితో పాఠశాల ప్రాంగణం మొత్తం శుభ్రం చేయించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు ఎంపీడీఓ వివేక్ రామ్, తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి, స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచు సిరిపురపు స్వప్న, ఆర్ఐ శంకర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: