-టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ
-టీఆర్ఎస్ సీనియర్ నేత భవానీ శంకర్ కుటుంబానికి పరామర్శ
మన్యం మనుగడ, పినపాక : మీ కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. కుమారుడి మరణంతో బాధపడుతున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోలేటి భవానీశంకర్ ను ఆదివారం ఎంపీ నామ పరామర్శించారు. కుమారుడు కోలేటి రవి ప్రసాద్ (రాజా) మృతికి గల కారణాలను భవానీ శంకర్ ను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని మనోధైర్యం కల్పించారు. ఎంపీ నామ వెంట మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు, పినపాక టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, మణుగూరు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పొనగొటి భద్రయ్య, స్థానిక సర్పంచ్ గొగ్గెల నాగేశ్వరరావు, ఎంపీటీసీ చింతపంటి సత్యం,సొసైటీ డైరెక్టర్ పటేల్ కామేష్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్తినేని వాసు, పినపాక మండల తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.. .
Post A Comment: