మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు జూలూరుపాడు, ఏన్కూరు, మండలాలకు చెందిన లబ్ధిదారులకు 1,43,500 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాములు నాయక్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. అనేక రకాల ఆరోగ్య సమస్యలతో టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయపడాలనే ఉద్దేశంతో ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమందికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారని తెలిపారు. దళితులకు "దళిత బందు" పధకాన్ని పెట్టి దళితులకు అండగా నిలవబోతున్న ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో అందరూ తెలంగాణ ప్రభుత్వానికి టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడి మూడవసారి టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు పిఎసిఎస్ చైర్మన్ లేళ్ల వెంకట రెడ్డి, ఏన్కూరు పిఎసిఎస్ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఎంపిపి లావుడియా సోనీ, ఏన్కూరు రైతుబంధు మండల కన్వీనర్ మేడం ధర్మారావు, ఏనుకూరు మండల పార్టీ అధ్యక్షులు భానోత్ సురేష్ నాయక్, వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్, జూలూరుపాడు ఎంపీటీసీ పెండ్యాల రాజశేఖర్, కాకర్ల ఎంపిటిసి పొన్నెకంటి సతీష్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చౌడం నరసింహారావు,యదళ్లపల్లి వీరభద్రం , ఏన్కూరు ఏఎంసీ చైర్మన్ భూక్యా లాలు, పొన్నగంటి వీరభద్రం, టిఆర్ఎస్ నాయకులు వేల్పుల నరసింహారావు, కొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ భూరం వెంకట లక్ష్మి, తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: