మన్యం టీవీ,అశ్వాపురం:అశ్వాపురం మండలంలోని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి నుండి వచ్చినటువంటి చెక్కులను అశ్వాపురం మండలం మరియు జగ్గారం గ్రామాలలో ఈరోజు సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను ఎంపీపీ ముత్తినేని సుజాత, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ ల చేతులమీదుగా బాధితులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి. షరిపుద్దీన్, సర్పంచ్ సున్నం రాంబాబు, ఎంపీటీసీ ఏనిక రవి, గాలి బ్రహ్మానంద రెడ్డి, యువజన నాయకులు వల్లబోజు మురళి, మందా హుస్సేన్, ఈసంపల్లి పున్నారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: