మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన నీలపాల విమల (35) గురువారం సాయంత్రం పాము కాటుకు గురై మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన నీలపాల విమల వరి నాట్లు వెయ్యడానికి వెళ్ళి వస్తుండగా పాము కాటు వేసింది. దీంతో వెంటనే అశ్వారావుపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయింది. దింతో మృతిరాలి కుటుంబం లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి రాలికి భర్త, ఇద్దరు పిల్లులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్త్ ప్రారంభించారు.
Post A Comment: