మన్యం టీవీ కరకగూడెం: తమ పుట్టిన రోజు సందర్భంగా మూడవ విడత గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కరకగూడెం గ్రామపంచాయతి ఉపసర్పంచ్ రావుల రవి కుమారులు రావుల ప్రణయ్ గౌడ్,ప్రణీత్ గౌడ్ లు తమ పుట్టిన రోజు సందర్భంగా ఇంటి ఆవరణ లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఉపసర్పంచ్ రావుల రవి దంపతులు పాల్గొన్నారు.
Post A Comment: