గుండాల ఆగస్టు 18 (మన్యం మనుగడ) న్యూమోనియా రాకుండా పిల్లలకు కొత్త టీకా వచ్చిందని స్పెషల్ ఆఫీసర్ బావ్ సింగ్ అన్నారు. గురువారం మండలంలో ఆయన పర్యటించి టీకా కార్యక్రమాన్ని పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడుతు శిశువులకు ఆరు వారాల కు మొదటి మోతాదు, 14 కు రెండో మోతాదు, తొమ్మిది నెలల కు మూడో మోతాదు ఇస్తామన్నారు. చిన్న పిల్లలకు తప్పకుండా వేయించాలన్నారు. న్యూమోనియా మరణాలను ఈ టికా తో నివారించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి చంద్, మునావర్ వలి, ఆరోగ్య పర్యవేక్షకురాలు పద్మ, ఏఎన్ఎం అరుణ, భువనేశ్వరి, అనసూయ, కమల, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: